ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు సమస్యలు వస్తున్నాయి . రకరకాల షా౦పులు పెట్టిన ఫలితం ఉండదు . ఈ సమస్యలకి సింపుల్ చిట్కా మీ కోసం . అయిదు చెంచాల ఉసిరిక పొడి గాని లేక పది పదిహేను ఎండిన ఉసిరిక ముక్కలు గాని తగినన్ని నీటిలో వేసి రాత్రి నుంచి ఉదయం వరకు నానబెట్టాలి . ఉదయం మెత్తని పెస్టుగా నూరుకొని పైన తెలిపినట్లు తలకు పెట్టి ఒక గంట ఆగిన తరువాత తల కడగాలి . ఈ విదంగా వారానిక రెండు సార్లు చేస్తు వుంటే వెంట్రుకల బలహీనత , తలలో దురద , తెల్లని పొట్టు రాలటం వంటి సమస్యలు క్రమంగా తగ్గిపోయి అందమైన కేశ సంపద , దృడమైన జుట్టు మీ స్వంతం అవుతుంది . ( క్రిష్ణార్పణమ్ )
నా బ్లాగ్ కి విచ్చే సిన మిత్రులకి స్వాగతం సుస్వాగతం ( సర్వం శ్రీ క్రిష్ణార్పణమ్) నా అనుమతి లేనిదే ఈ సైట్ లోని పోస్ట్ లు కాఫీ &; పేస్ట్ చేయరాదు
31, మార్చి 2016, గురువారం
30, మార్చి 2016, బుధవారం
మజ్జిగను ఎలా తాగాలి ?
పూర్వం ప్రతి ఇంట్లో ఆవులు గేదెలు వుండేవి అప్పుడు పెరుగు బాగా వుండి కుడా మజ్జిగ ఎందుకు మాత్రమే వాడారు ? మరి ఇప్పుడు అందరు పెరుగు వాడుతున్నారు . ముఖ్యంగా పెరుగును రాత్రి తిన కూడదు . రాత్రి పెరుగు తింటే వాతం ఎక్కువగా ఉంటుంది . ఈ నాటి గృహిణులు అందరు తెలుసుకోవాలి . ఆయుర్వేదంలో మజ్జిగను పది రకాలుగా చెప్పారు అవి ఇప్పుడు చూద్దా౦. మదితము అనే మజ్జిగ ; పేరు కొన్న పాలలో నీరు కలపకుండ చిలికి తయారు చేసిన మజ్జిగ . ఇది చిక్కగా జిడ్డుగా వుంటుంది ఈ మజ్జిగ ఆహారంలో వాడుతూ ఉంటె నిరసం ఉదర రోగాలు పైత్యం వల్ల కలిగిన వాతం నాలుకకు రుచి తెలియక పోవడం మూత్రము ఆగి పోవుట . నీళ్ళ విరోచనాలు మొదలైనవి హరించి పోయి శరీరానికి బలము కలుగు తుంది . ఈ రకమైన మజ్జిగ మన రెండు రాష్టాల ప్రజలు గ్రీష్మ ,శరత్ , హేమంత శిశిర రుతువులలో సేవించి ఆరోగ్యం పొందవచ్చు . (2) మిలితమను మజ్జిగ ; పెరుగు ఒక వంతు నీళ్ళు మూడు వంతులు పోసి చిలికి తయరు చేసిన మజ్జిగ . ఇది శరీరంలో ని పైత్యం అరుచి ని అతిసార , విరేచానాన్ని రక్తంలో చేరిన వాతాన్ని ఇంకా అనేక రోగాలను కుడా హరించి వేస్తంది . ( ౩) గోళము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు ఒకటిన్నర వంతు నీరు కలిపి తయారు చేసినది . ఈ విధమైన మజ్జిగ ను వాడుతూ వుంటే వీర్య వృద్ది , కలిగి శరీరానికి కాంతి వస్తుంది . కళ్ళకు మేలు చేస్తుంది . ఉదరములో మందగ్ని విష దోషములు , మేహము , ప్రమేహము , కఫ , రోగము ఆమ రోగము , అను వానిని పోగొడుతుంది . ఈ రకమైన మజ్జిగ గ్రీష్మ , వర్ష , రుతువుల యందు సేవించ దగినది . ( 4) షాడభము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు అయిదు వంతుల నీళ్ళు కలిపి చేసినది ఇది శ్లేష్మ రోగాలను గుల్మ రోగాలను రక్త మూల వ్యాదిని పోగొడుతుంది తేలికగా ఉండి ఉదరములో జటరాగ్నిని పెంచి శరీరానికి కాంతి వస్తుంది . (5) కాలేశేయము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు రెండు వంతుల నీళ్ళు కలిపి తయరు చేసినది ఈ మజ్జిగ బంక విరేచనాలు , విషములను , ఉబ్బులను , మంటను , వాతమును ముఉల వ్యాదిని , పోగొట్టి శరీరమును త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది . ఇప్పటికే పడిన ముడతలు కుడా తిసి వేస్తుంది . ( 6) కరమదితము అను మజ్జిగ ; పెరుగు నీళ్ళు సమంగా కలిపి చిలికి తయారు చేసినది . ఈ మజ్జి గ వగరుగా , పుల్లగా , రుచి కరముగా ఉంటుంది . ఈ మజ్జిగలో కొద్దిగా వేడి స్వబావం , మల బద్ధకం చేసే గుణం కుడా ఉంది . అయితే దీని వలన జట రాగ్నిబాగా పెరుగు తుంది . ప్రమేహము , చర్ది , ఉబ్బు , ముఉల రోగం ,భగందరమూ , కామెర్లు , కఫ వాతము , అరుచి , వీటిని పోగొట్టి వీర్య వృద్దిని బలాన్ని అందిస్తుంది . ఈ మజ్జిగ ముఖ్యంగా వర్ష కాలలో సేవించడానికి అనుకూల మైనది . ( 7 ) ఉదాస్వితము అను మజ్జిగ ; పెరుగులో నాలుగవ వంతు నీళ్ళు పోసి చిలికి చేసినది . ఇది గుల్మములను , దెబ్బలను , అన్ని రకాల వాతములను , దారుణ వీరేచనాలను , తల తిప్పే రోగమును , మొదలైన సమస్త రోగాలను పోగొడుతుంది . దేహ పుష్టిని , ఇస్తుంది . ముఖ్యంగా ఈ మజ్జిగ గ్రీష్మ రుతువులో సేవింప దగినది . ( 8 ) తక్రమ అను మజ్జిగ ; పెరుగులో సగం వంతు నీళ్ళు కలిపి చిలికి తయారు చేసినది . ఇది తేలికగా ఉండి వేడిని అణచి వేస్తుంది . శరీరం తెల్లగా మారే పాండు రోగము , ఉబ్బు , కఫ , వాతము , కడుపులో బల్లలు , భందరము , ఉదార రోగాలు పోగొడుతుంది . దీనిని వసంత రుతువులో శొంటి , పిప్పలి , మిరియాలు , ఉసిరిక పప్పు , ఈ నాలుగు ఒకొక్క గ్రాము వంతున కలిపి తాగాలి . ( 9 ) దండ హతము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు రెండు వంతుల నీళ్ళు పోసి కవ్వముతో చిలికి తయారు చేసినది . ఇది రుచి కరముగా ,ఉంటుది . శరీరంలో అతి వేడి , అధిక కపము , ముత్రంలో పడే సుద్దా మొదలైన మేహములను మూలా వ్యాదిని పోగొడుతుంది . ఆహరం బాగా జీర్ణం చేస్తుంది . ఈ రకమైన మజ్జిగ ఎల్లప్పుడూ తీసుకోవచ్చు . ( 1౦ ) అతి మీలితము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు తొమ్మిది వంతుల నీళ్ళు పోసి చిలికి చేసిన మజ్జిగ . ఇది ముఖ్యంగా ముఖానికి సంబందిచిన రోగములను గుల్మ్ మును , బల్ల , భాగందరము , ఉదర రోగము , అనే సమస్యలను పోగొడుతుంది . ***** మజ్జిగ గుణ దోష ప్రభావాలు ***** మజ్జిగ త్రి దోష సంహరి అనగా వాత , పిత్త , కపము , అనబడే మూడు దోషాలను సమ స్థితికి తీసుకొచ్చి సర్వ రోగములను పోగొడుతుంది . నాటు ఆవు పాల నుండి కాని , నాటు గేదెల నుండి కాని పాలు తిసి పేరా పెట్టి చిలికి తయారు చేసిన మజ్జిగ భూలోక అమృతం . *** వాత రోగులు మజ్జిగ ఎలా వాడాలి ? *** శరీరంలో ఇ ఒక్క భాగం లో నైన గాని , వాతము చేరి నందు వళ్ళ కలిగిన వాత వ్యాదులకు ఒక గ్లాసు పుల్లని మజ్జిగ లో ఒకటి లేదా రెండు గ్రాములు దోరగా వేయించిన శొంటి పొడి అదే మోతాదులో సైందవ లవణం కలిపి రెండు పూటల తాగుతూ ఉంటే వాత వ్యాదులు అదుపులోకి వస్తాయి . **** పైత్య రోగులు మజ్జిగను ఎలా వాడాలి ? ***** శరీరంలో అరి కాళ్ళ మంటలు , అరి చేతులు మంటలు లేదా కళ్ళ మంటలు , తల , లేదా శరీరం అంత అమిత వేడితో కాలి పోతు ఉండడం చర్మ ము పై ఎర్రని పొక్కులు పుడ్లు రావడం నవ రంద్రాలలో ఎటు నుండి అయిన రక్తం రావడం మొదలైన అనేక సమస్యలు ఉన్న వారు తియ్యని పలుచని ఒక గ్లాసు మజ్జిగ లో ఒక టే స్పూన్ కండ చక్కర పొడి కలిపి రెండు లేక మూడు పూటల తాగుతూ ఉంటే పైత్య రోగం అదుపులోకి వస్తుంది .
29, మార్చి 2016, మంగళవారం
మహాభారత యుద్దంలో ఎన్ని వ్యూహాలు ఉన్నాయో మీకు తెలుసా
క్రౌ౦చారుణ వ్యూహం ; ద్రుష్ట ద్యుమ్నుదు క్రౌ౦చ పక్షి ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు మకర వ్యూహం ; ఐదవ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని నిర్మిస్తాడు గరుడు వ్యూహం ;మూడవ రోజున ఈ వ్యూహాన్ని భీష్ముడు నిర్మించాడు దీనినే సువర్ణా వ్యూహం అంటారు శకట వ్యూహం ; పదకొండవ రోజున ఈ వ్యూహం ద్రోణా చార్యుడు నిర్మించారు బండి ఆకారంలో సైన్యం నిలిపి కేంద్ర స్థానంలో ద్రోణా చార్యుడు ఉంటాడు . చక్ర వ్యూహం ; పద మూడవ రోజున ఈ వ్యూహం నిర్మించారు దీనినే పద్మా వ్యూహం అంటారు .ద్రోణా చార్యుడు ఈ వ్యూహంలో అభి మన్యున్ని భళి తీసుకున్నాడు . భార్హ స్పత్య వ్యూహం ; పది హేడవ రోజున బృహస్పతి సహకారంతో కర్ణుడు ఈ వ్యూహం పన్నాడు . శృంగాటక వ్యూహం ; ఎనిమిదవ రోజున నిర్మించిన ఈ వ్యూహంలోత్రికోనాకారంలో సైన్యం నిలుపుతారు ద్రుష్ట్యద్యుమ్నుడుభీష్ముని వ్యూహానికి ప్రతిగా నిర్మిస్తాడు . శ్యేన వ్యూహం ;ఈ వ్యూహం ఐదవ రోజు నిర్మిస్తాడు . దీనినే డేగ వ్యూహం అని కూడా అంటారు . భీష్ముడి మకర వ్యూహం నికి ప్రతిగా ద్రుష్ట్య ద్యుమ్నుడు నిర్మించాడు . అర్ద చంద్ర వ్యూహం ; మూడవ రోజు భీష్ముడు పన్నిన గరుడ వ్యూహం నికి ప్రతిగా దృష్ట్యా ద్యుమ్నుడుఈ వ్యూహం నిలుపుతాడు . మండల వ్యూహం ; ఏడవ రోజున నిర్మించినఈ వ్యూహంలో భీష్మా చార్యుడు కురుసేనను మండలకారంలో నిలుపుతాడు . మండలార్డ వ్యూహం ; ద్రోణుడు పన్నెడో రోజో కురు సేనను గరుడ వ్యూహంలో నిలుపగా ధర్మ రాజు పాండవ సైన్యం తో ఈ వ్యూహం రచిస్తాడు . వజ్ర వ్యూహం ; ఏడవ రోజున భీష్ముడు కురుసేనను మండల వ్యూహం తో నిలువరించగ ధర్మ రాజు పాండవ సేనలను వజ్ర వ్యూహం తో నడిపిస్తాడు . సూచి ముఖ వ్యూహం ; ఆరవ రోజున దృష్ట్యా ద్యుమ్నుడు పాండవ సేనను మకర వ్యూహం తో నిలుపగా దానికి ప్రతిగా భీష్ముడు క్రౌంచ వ్యూహం తో సైన్యాన్ని నడిపిస్తాడు . రెండు వ్యూహాలు భంగ పడడంతో అభి మన్యుడు సూచి ముఖ వ్యూహం పన్నుతాడు . వ్యాల వ్యూహం ; నాలుగవ రోజు భీష్ముడు కురు సేనను ముడి వేసు కున్న పాముల నిలుపుతాడు ఈ వ్యూహం ద్వారా సకల సైన్యాల కదలికలను అంచనా వేయటం కష్టము . సర్వ తో భద్ర వ్యూహం ; తొమ్మిదో రోజు కురు సేనతో ఈ వ్యూహం భీష్ముడు రచిస్తాడు . మహా వ్యూహం ; రెండవ రోజు భీష్ముడు ఈ వ్యూహం అనేక విధాలుగా నిర్మించి అందరిని హాడ్ల కొట్టాడు . ఎనిమిదవ రోజో కూడా ఈ వ్యూహం భీష్ముడు నిర్మించాడు . తొమ్మిదో రోజు కూడా భీష్ముడు నిర్మించిన సర్వత్ భద్ర వ్యుహనికి ప్రతిగా ద్రుష్ట్య ద్యుమ్నుడు మహా వ్యూహం నిర్మిస్తాడు .
27, మార్చి 2016, ఆదివారం
26, మార్చి 2016, శనివారం
25, మార్చి 2016, శుక్రవారం
శ్రీ మహా లక్ష్మి దేవి కుటుంబం
మహా లక్ష్మి దేవి మన అందరి దైవం ఆమె గోత్రం ' భార్గవ ' తల్లి పాల సముద్రం . తండ్రి భ్రుగు మహర్షి . తమ్ముడు చంద్రుడు . కోడలు సరస్వతి . భర్త శ్రీహరి . పుత్రులు ఆనందుడు , కర్దముడు , చిక్లితుడనే ఋషులూ . కృత యుగంలో ఈమె పేరు శ్రీ మహా లక్ష్మి . భర్త శ్రీ హరి . త్రేతా యుగంలో ఈమె సీత భర్త శ్రీ రాముడు . ద్వాపర యుగంలో భర్త శ్రీ క్రిష్ణ . కలి యుగంలో ఈమె పేరు అలర్ మెల్ మంగ ( అలర్ - పుష్పల యొక్క , మెర్ - పై భాగంలో కనిపిస్తూ దర్శన మిచ్చి న మంగ - కన్నె - ఈమె పద్మావతి . పద్మ్లలో దాగి పుట్టినది . ' అల మేలు మంగ ' అన్నారు భర్త శ్రీ వెంకటేశ్వరుడు . వాహనం గుడ్ల గూభ .(తాళ పత్ర నిధి నుండి )
ప్రపంచ చరిత్రలో ముఖ్య సంగటనలు (1)
క్రీ .పూ . 5000 -ఈజిప్టు మోట్ మొదటి చక్రవర్తి (పారో) పరిపాలన . 4000 - బాబియాలోని సుమేరియన్ల నాగరికత . 3900 - 2500 ఈజిప్టు లో పిరమిడ్ల నిర్మాణం . 2500 - చైనా నాగరికత .2000 - అబ్రహం , ఇసాక్ ల కాలము ..
1000 - ఈజిప్టు సామ్రాజ్య పతనం . 776 - గ్రీస్ లో మొదటి సారిగా ఒలింపిక్ పోటి నిర్వహణ . 753 - రొమ్ నగర స్తాపన , పర్ష్ యాన్ ల పై గ్రీకుల గెలుపు ' 721 - మొదటి చంద్ర గ్రహణం గుర్తిచి నట్లు టాలెమీ ప్రకటన .605 - పర్షియ జోరాష్టారు ,జోరశ్ర్తియాన్ మత స్థాపన . 551- చైనాలో ప్రముఖ పండితుడు కన్ ప్యూషియస్ జననమ్ .4౩౦ - స్పార్టా , ఏతేన్సాల మద్య యుద్ధం ' ౩99 - సోక్రటిస్ మరణం ' ౩6౦ - మహాశయుల ప్లేటో అరిస్టాల్ ల కాలం ' ౩56 - అలేగ్జాండర్ ది గ్రేట్ జననం ౩2౩ - బాబి లోన్ లో అలెగ్జాండర్ మరణం . 214 - ది గ్రేట్ వాల్ ఆప్ చైనా నిర్మాణం . 158 - ప్రా స్న్ పై రోమన్ ల విజయము . 8౦ - జెరూసలెం పై రోమన్ ల విజయం . 69 - ఈజిప్టు రాణి క్లి యె పాత్ర జననం . 55 - రోమన్ సామ్రాజ్య పాలకుడు సీజర్ చే బ్రిటన్ ఆక్రమణ . 44 - జూలియస్ సీజర్ హత్య. 27 - రోమన్ సామ్రాజ్య స్థాపన . 4 - ఏసు క్రీస్తు జననం .
1000 - ఈజిప్టు సామ్రాజ్య పతనం . 776 - గ్రీస్ లో మొదటి సారిగా ఒలింపిక్ పోటి నిర్వహణ . 753 - రొమ్ నగర స్తాపన , పర్ష్ యాన్ ల పై గ్రీకుల గెలుపు ' 721 - మొదటి చంద్ర గ్రహణం గుర్తిచి నట్లు టాలెమీ ప్రకటన .605 - పర్షియ జోరాష్టారు ,జోరశ్ర్తియాన్ మత స్థాపన . 551- చైనాలో ప్రముఖ పండితుడు కన్ ప్యూషియస్ జననమ్ .4౩౦ - స్పార్టా , ఏతేన్సాల మద్య యుద్ధం ' ౩99 - సోక్రటిస్ మరణం ' ౩6౦ - మహాశయుల ప్లేటో అరిస్టాల్ ల కాలం ' ౩56 - అలేగ్జాండర్ ది గ్రేట్ జననం ౩2౩ - బాబి లోన్ లో అలెగ్జాండర్ మరణం . 214 - ది గ్రేట్ వాల్ ఆప్ చైనా నిర్మాణం . 158 - ప్రా స్న్ పై రోమన్ ల విజయము . 8౦ - జెరూసలెం పై రోమన్ ల విజయం . 69 - ఈజిప్టు రాణి క్లి యె పాత్ర జననం . 55 - రోమన్ సామ్రాజ్య పాలకుడు సీజర్ చే బ్రిటన్ ఆక్రమణ . 44 - జూలియస్ సీజర్ హత్య. 27 - రోమన్ సామ్రాజ్య స్థాపన . 4 - ఏసు క్రీస్తు జననం .
24, మార్చి 2016, గురువారం
17, మార్చి 2016, గురువారం
16, మార్చి 2016, బుధవారం
15, మార్చి 2016, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)