29, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఇంటి ముందు కళ్ళాపి ఎందుకు చల్లాలి ?

పూర్వం మన దేశంలో గురుకులాల్లోని విద్యార్దులు భిక్షమెత్తి గురువుకి సమర్పిస్తూ విద్యాభ్యాసం చేసేవారు . గ్రామా పురోహితుడు , బౌద్ద బిక్షువులు కూడా " భవతి భిక్షం దేహి " అని గృహస్తులను అర్దించేవారు . " అతిధి దేవో భవ " అన్న సంస్కృతి మనది . బియ్యం , జొన్నలు , రాగులు , మొదలైన ఆహార, ధాన్యంతో పాటుగా కూరగాయలు కూడా ధర్మచారంగా దానం చేసేవారు . గృహస్తులు ఆవుపేడతో కళ్ళాపి చల్లి రంగ వల్లులు దిద్దిన యింటిముందు మాత్రమే ధర్మ భిక్షను అర్దించేవారు . ఏ ఇంటి ముందైన కళ్ళాపి లేకుంటే ఆ ఇంటిలో ఎదో " అశుభం " జరిగి ఉంటుందని అవగాహన చేసుకొని ముందుకి సాగిపోయో పద్ధతి ఉంది . కాల క్రమేనా ఇదొక ఆచారమయింది . ఆవు పేడను నీటిలో కలిపి కళ్ళాపి చల్లడం వల్ల రోగ  కారక క్రిమి ఇంటి లోనికి ప్రవేశించకుండా వుంటుంది . సూర్యోదయానికి ముందే కళ్ళాపి చల్లాలి . ఆ ఆచారము లక్ష్మి దేవికి ఆహ్వానము , సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో కళ్ళాపి చల్ల కూడదు . 

26, ఏప్రిల్ 2016, మంగళవారం

నల్లగా మారిన ముఖాన్ని తెల్లగా లేక ఎర్రగా ఎలా మార్చుకోగలం

అమ్మాయిలు , అబ్బాయిలు మీ ముఖం నల్లగా మారి పోతుందని మీకు బెంగగా ఉందా ? ప్రతి చిన్న సమస్యకు ఆందోళన పడకూడదు . ఇలా మనసులో మలినం లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఈ క్రింది వాటిల్లో ఎదో ఒకదానిని ఆచరించండి . 

బాదం పప్పుతో  బంగారు యోగం  

ఉదయం పూట నాలుగు బాదం పప్పులను అరా గ్లాసు మంచి నీటిలో వేసి నానా బెట్టండి .సాయంత్రం ఆ పప్పులపైన  ఉన్న తోలు తీసివేసి లోపలి పప్పును మెత్తగా నలగొట్టి అందులో తగినన్ని దేశవాళి గేద పాలు కలిపి మెత్తగా నూరితే గిజ్జు లాగ అవుతుంది . ఈ గుజ్జును రాత్రి నిద్రించే ముందు ముఖానికి లేపనం  చేసుకొని ఉదయం గోరు వెచ్చని నీటితో కడగండి . ఇలా పది , పదిహేను రోజులు చేసేటప్పటికి మీ ముఖంలో మార్పు కనిపిస్తుంది . 

శనగ పిండితో 

రెండు చెంచాల శనగ పిండి తీసుకొని అందులో తగినన్ని దేశవాళి గేద పాలు కలిపి మెత్తగా నూరి నల్ల బడ్డ ముఖానికి పట్టించాలి . అరగంట పాటు పౌర్ణమి నాటి చంద్రుడిని తలుచుకొని అతని తెల్లని కాంతి మన ముఖంలో కి వస్తున్నట్టు బలంగా భావన పెట్టుకోవాలి . తరువాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి . ఈ విధంగా ప్రతి రోజు చేస్తుంటే అతి త్వరలో నలుపు హరించి ముఖ కాంతి పెరుగుతుంది . 

పాలతో .......

దేశవాళి గేద పాలు తీసుకొచ్చి , కాచి దించి అందులో కొద్దిగా ఉప్పు గాని , నాలుగైదు చుక్కల నిమ్మరసం గాని వేస్తె పాలు విరిగి పోతాయి . అలా విరిచిన పాలను వడపోసి నీరు తీసి చిన్న చిన్న తునకలుగా పగిలిన పాల ముక్కలలో సమంగా కస్తూరి పసుపు , బార్లి గింజల పిండి కలిపి మెత్తగా నూరి మఖనికి మెడకు ,గొంతుకు ఇంకా శరీరంపై నల్లని మచ్చలు వచ్చిన చోట అరంగుళం మందంగా లేపనం చేయాలి . అరగంటాగి గోరు వెచ్చని నీటితో కడగాలి . ఇలా ప్రతి రోజు చేస్తుంటే చెడు పదార్దాలు లతో గట్టి పడ్డ చర్మం మెత్తబడి క్రమంగా నలుపు చెరిగి పోయి మంచి కాంతి వస్తుంది .

24, ఏప్రిల్ 2016, ఆదివారం

శ్రీ వీర బ్రహ్మం గారి త్రికాల జ్ఞానము { సాంద్ర సింధు వేదము }

 వసుధలో { భూమిలో } పంటలు ఎండును . కందినూరులో స్ర్తీ పురుశుడగును . ఉత్తరాదినుండి ప్రజలు వలస వత్తురు . యుద్దములు ఎక్కువగా జరుగును . ఉత్తర దేశమున ప్రజలు కత్తులతో పోరాడేదరు . నది నదములు ఉప్పొంగి ఊల్లన్ని కొట్టుకుపోవును . హంపిలో ఉన్న హనుమంత రాయుడు వీధుల వెంట కేకలు వేయును . అ కేకలకు మహా నంది మూలన ప్రజలు  ఆకులు రాలినట్లు రాలుదురు . మాల మాదిగలు భూపాలగుదురు. మేలు కీడగును . తార తమ్యము లేక ప్రజలు తిరిగుదురు . పదహారు చేతులు గల కామిని గండి కోట  మీద తిరుగును . ఆకాశమున భుగు పుట్టును . ఆవులు ఆకాశము వంక చూసి అరచును . కొత్త పేట సంత పురమునకు మాటలాడే కోతి వచ్చును . ఆ కోతి యత్తేపు రామన్న గట్టు మీద ఏడు దినములుండును . పల్లెలు పట్నాలు గృహ పీడా వలన పాడగును  . కామ క్రోధములు ఎక్కువగును . ధనము కొరకు కలహములు ఎక్కువగా జరుగును . నల్లని ఆవులు ఎక్కువ పాలిచ్చును . బిడ్డలు లేని గోడ్రండ్రా కడుపున బిడ్డలు పుట్టును . జనులకు కష్టములు కలుగ బోవు ముందు వడి గళ్ళ వాన కురియును . పగలు వేళా నక్కలు గ్రామములో అరచును . కుక్క  మూతికి తోక పుట్టును . మద్య పానము వలన జనులు కొట్టుకోనిదేరు . ప్రతి వారు విద్య యందు అపేక్ష కలిగి యుందురు . పాతాళ గంగ యింకును . మంటలు ఎక్కువగా మండును . పాతకులు నశింతురు. నీతి మంతులు నిలిచు యుందురు . వారిదు లింకును వసుధ పాడగును . నక్షత్రములు భూమిమీద రాలును . భరతుని శాపముచేతను శూద్రుల భాగ్య దేవత తొలగి పోవును . కొండవీడు కొల్లబవును . మధుర మీనాక్షమ్మ మాటలాడును . అనేక అద్భుతాలు పుట్టును . నెల్లూరు సీమంతయు నిర్మలమగును . నిడిగల్లు నిర్డుత మగును .ముండ మోపులంత కన్నేలగుదురు . మదముతో భూమినేలేదరు. ఎండా వెన్నెల రెండు సమముగా యుండును . యాగములు ఎక్కువగా చేయుదురు . నాగయ్య అనే 7 సం || ల బాలుడు నాలుగు వేదములు చదువును . బనగానే పల్లె గొప్ప పట్నామగును . భాగ్యముతో తుల తూగుచుండును . రూకకు పుట్టెడు ధాన్యము తరువాత పోకకు పుట్టెడు అమ్ముదురు .లోకములో అన్నము కలిగి ప్రజలు సుఖి౦చెదరు. రామేశ్వరము యెద్ద రణరంగమగును. రాజులు నశించెదరు. కామాక్షి తల్లి కరుణించి భక్తులగాచును . రాయ దుర్గామునకు రామ చిలుక వచ్చి రామధర్మ రాజు వార్తలు చెప్పును . పాయ కట్టు పశువుల యెద్ద  ఏడేండ్ల  పడతికి పిల్లలు పుట్టేదురు . మహా నంది సమీపమున మాల బోయలు ముష్టి యుద్దమున జచ్చేదరు . గోలు కొండలో కొంగ మాటలాడును . ముండ్ల పాటి యెద్ద మునులందరు చేరుదురు . గుండ్లన్నియు తేలును . బెండ్లన్నియు మునుగును . భూ భారము తగ్గును . గంగ , యమునలు ఉప్పొంగును . తుంగ భద్ర తీరమున ముగ్గురు మూర్తులు శృంగారముగా యోలదరు . మేలయిన కృతయుగము ధర్మమము నడుచును . ప్రపంచమంతయు మహా ప్రలయంబులతో నుండు కాలము లగ్నంబులను  బెట్టుకొని ప్రపంచముపైకి పరిగిడుచు వచ్చు చున్నది . కాలమాన పరిస్థితులు క్షణ క్షణంబు నకు మారు చుండును .  { TO BE KUN ....} 

23, ఏప్రిల్ 2016, శనివారం

శ్రీ వీర బ్రహ్మం గారి త్రికాల జ్ఞానము{ సాంద్ర సింధు వేదము }

శ్లో || ప్రభవ  పార్దివ మధ్యేషు 

బహు ప్రళయ నిశ్చయం 
అనంతరే , అనంత నిధ్యే 
రక్త పాతౌ రణరంగ భూమే 
భిభత్సా ప్రపంచ స్థితి ; 
ప్రభవ నామ సం|| నుండి పార్దివ నామ సం|| ర మధ్య కాలమున అనేక ప్రలయములు సంబవించుట జరుగును . అనంతరమున భుమండలమంతయు ఒక రణరంగాముగా మారి ఉహించని రక్త పాతంతో ప్రపంచము భయంకరముగా భీభత్స స్థితిలో కనిపించును . 
కలియుగము 5000 సం || ల పిమ్మట . జరిగే కాల జ్ఞాన విశేషములు 
భరత ఖండoభును పరదేశ వాసులు పాలన చేయుటకు వచ్చెను . వర్ణ సంకరంబు అధికమయ్యెను . అగ్ర వర్ణాలన్నీ కలుషితంబయ్యోను . గుళ్ళలో దేవతల మహిమలే నశియి౦చెనయ. మంత్రం తంత్రములలో శక్తి సన్నగిల్లెను విప్ర జాతుల వారికీ సైతము మద్య మాంసములపై  కోరికలు అధికం అయ్యోను . కనక గర్భం బైన భరత భూమిని పర దేశ వాసులు కొల్లగోట్టేదరు.ఉత్తర దేశమున వైశ్య కులమునందు గందోకడు జనియించెను .వాడు ఎకునే చేబట్టి ఎల్లా జనుల నేకంబుచేసి స్వరాజ్యం తెచ్చెను .రెండుక్షరాల పేరైన వాడు దేశాన్ని 1 8 సం|| లు పాలన చేసెను . ముడుపులు వెంకటేశ్వర స్వామికి ఇష్టమని ప్రజలు ఆ ముడుపులు తిరుపతికి జేర్చేదరు. కడప వద్దనున్న కమల పురంలో కప్పు కోడి వలే కూయును . జాతి జాతికి మధ్య వైరములు కలుగును . జనులు తల్లడిల్లెదరు . పెన్నా యోడ్డునున్న చెన్నూరు గ్రామము వరద పాలగును . ఈశాన్యమునుండి విష గాలి వచ్చి విపరీతముగా నరులు జత్తురు . కపట కిరాతకులను ఖండించుటకు కలికవతారుడు అవతరించును . ఉల్లిగడ్డకు ఉపదేశామిచ్చు కల్ల గురువులు కలికాలమందు వత్తురు . అట్టి గురువునేల్ల యముడు కాల దన్నును . కల్లలేనివారిని గాచును . కోయ రాజ్యం అంత గొడవల పాలగును . సైదా పేటలో సాహెబులందరూ సమరమున సచ్చేదరు . అద్దంకి సీమలో యాదవుని  ఇంట బుద్దునంతటి వాడు పుట్టును .తల్లి పిల్లలు తగువులాడు దినములు  వచ్చును . గద్దలను కాకి తన్నును . బ్రాహ్మణులకు పీటలు మాలలకు మంచాలు వేయుదురు . మధుర తంజావూరులు హరించును . మహానంది శిఖరము విరుగును . హంపి వీరుపాక్ష రెండు కన్నుల నడుమ అగ్ని వర్షం కురుయును . భూమి వణికి గ్రామంబులందును ముండ మోపులంత ముతైదులు అయ్యోరు . ముందు  ఏమి జరుగునో తెలియదందురు. చెడు నడలతేచే ప్రవర్తించు జనులు పండుటాకులు రాలినట్లు రాలుదురు . కుంభ కోణంలో గో వధ  ఎక్కువగా జరుగును . కొల్ల పురము కొల్లగోట్టేదరు .కంభం చెరువులో పొన్న పూయును ఆదోనీలో కప్ప కోడి కూచినట్టు అందరు వినుచుండగా కూయును . వావి వరసలు లేక జనులు చరించేదరు . { to be kun .....} 

20, ఏప్రిల్ 2016, బుధవారం

పసి పిల్లల వ్యాదుల్ని ఎలా తెలుసుకోవాలి

మాటలు రాని వయసులో ఉన్న పసి పిల్లలు తమ శరీరంలో ఏ భాగాన్ని తమ చేతితో అనేక సార్లు తాకుతూ ఉంటారో ఏ భాగం పైన పెద్దల చేయి తగిలితే సహించలేక ఏడుస్తూ ఉంటారో ఆ భాగంలో నొప్పి ఉన్నాదని పెద్దలు తెలుసుకోవాలి . 
పసి బిడ్డలా - ఛాతి నొప్పి లక్షణాలు ;- 
పిల్లలు ఎక్కువ సమయం కళ్ళు మూసుకొని ఉంటె ఆ పిల్లలకు శిరస్సులో నోప్పి  ఉన్నాదని గుర్తు . అలాగే పిల్లలు నాలుకను పెదవులను మాటిమాటికి నొక్కుతూ చేతులను ముడుచుకుంటే వారికీ రొమ్ములో అనగా చాతిలో నొప్పి ఉన్నాదని తెలుసుకోవాలి . 
పసి బిడ్డలా - కడుపునొప్పి లక్షణాలు ;- 
సుఖ  విరోచనం కాకుండా మల బంధం జరిగిన లేక వాంతి చేసుకుంటున్న లేక పాలు తాగేటప్పుడు తల్లి స్తనాలను కొరుకుతున్న లేక బిడ్డల ప్రేవులు అరుస్తూ ఉన్న ఈ లక్షణాలు శిశువులుకు కడుపులో నొప్పి ఉన్నాదని అర్ధం చేసుకోవాలి . 
పసిబిడ్డల ఆసనం - నొప్పి లక్షణాలు ;- 
మూత్రం సరిగా విడుదల కాక పోయిన లేక అకారణంగా ఉలికిపడుతూ ఉన్న అటు ఇటు దిక్కులు దిక్కులు చూస్తూ ఉన్న బిడ్డలకు గుదము నందు అనగా ఆసనం లో నొప్పి ఉన్నదని తెలుసుకొని తగిన చికిత్సలు చేయాలి . 
పిల్లలకు - పండ్లు వచ్చేటప్పుడు కలిగే వ్యాధులు ;- 
పసి బిడ్డలకు దంతాలు మొలిచే సమయం సర్వ రోగాలకు కారణమని ఆయుర్వేద శాస్త్ర వేత్తలు తెలియ చేసారు . ఆసమయంలో బిడ్డలకు జ్వరము మల బంధము , దగ్గు , వాంతి , తల నొప్పి , అనే వ్యాదులు ఎక్కువగా పుడుతుంటాయి . 
పిల్లల - పొత్తి కడుపు లక్షణాలు ;- 
బిడ్డలకు కడుపు ఉబ్బురంగా ఉండి మాటిమాటికి కడుపును పైకెత్తుతూ ఉంటె వారికీ పొత్తి కడుపులో నొప్పి ఉన్నదని గుర్తు పట్టాలి . 
అక్షిత 

16, ఏప్రిల్ 2016, శనివారం

అభిషేకం చేస్తుండగా కళ్ళు తెరచిన శివుడు { విడియో }


దేవా రహస్యం ; శ్రీ రాముని జన్మ రహస్యం { 2 }

hm t. v. 2014   ఏప్రిల్ 
ఒక చతుర్యుగం అంటే 4 ౩  లక్షల 2 ౦ వేల సంవత్సరాలలో పూర్తీ అవుతుంది .ఇందులో 4 లక్షల ౩ 2 వేల సం || లు కలియుగం .దీనికి రెట్టింపు అంటే 8 లక్షల 6 4 వేల సం || లు ద్వాపర యుగం . కలియుగానికి మూడు రెట్లు అంటే 1 2 లక్షల  9 6 వేల సం || లు త్రేతా యుగం . కలియుగానికి నాలుగు రెట్లు అంటే 1 7 లక్షల 2 8 వేల సం|| లు కృత యుగం . ఈ లెక్కల ప్రకారం త్రేతా యుగం ఇవాల్టికి 8 లక్షల 6 6 వేల సం || లు క్రితం ముగిసిందన్న మాట . ఆ ప్రకారం రామాయణం 8. 1/2 లక్షల  సం || ల క్రితమే జరిగింది . యుగ విభజన ప్రకారం లెక్క రాముడు 8 .1/ 2 లక్షల క్రితం ఈ దేశాన్ని పరిపాలించాడని ఈ యుగ విభజన చెబుతుంది . ఇన్ని సం || ల క్రితం నాటి చరిత్రకు ఆనవాళ్ళు దొరకడం సాద్య్హమేనా ? ఈ యుగ విభజన ప్రకారం ఖగోళ గమనాన్ని గణిస్తే " పునర్వసు  నక్షత్రంలో  ఉత్తరాయణ పుణ్య కాలంలో చైత్ర శుద్ధ నవమి రోజున రామ చంద్రుడు  జన్మించాడు " అంటే 8 లక్షల ౩ వేల 2 ౩ వ సం || లో  రామ చంద్రుడి జననం జరిగింది . రావణ వధ తరువాత ఆయన 1 ౩ వేల సం || ల పాటు భారత దేశాన్ని పరిపాలించాడని వాల్మికి రామాయణం చెబుతుంది . దీనికి పూర్తీ స్తాయి హేతు బద్దత ఏంటి అంటే హిందూ యుగ ధర్మమే . చతుర్యుగ కాల మానమే ఇందుకు ఏకైక కొలమానం . దీనికి స్పష్టమైన ఆధారాలు చూపించటం కష్టమే . ఈ లెక్కల ప్రకారం 2 8 వ  మహా యుగంలో రామాయణం జరిగింది . కాని ఇప్పుడు ఖగోళ శాస్త్ర వేత్తలు మాత్రం అదేం వాల్మికి రామాయణాన్ని ఆధారం చేసుకొని రాముడి కాలాన్ని ఖచ్చితంగా నిర్దా రిస్తున్నారు . వారి గంణకాల ప్రకారం రామాయణ కాలం కేవలం 1 ౦ వేల సం || క్రితం జరిగిందని అంటున్నారు . లెక్కలతో సహా నీరుపిస్తున్నారు . తేదీలతో సహా చెబుతున్నారు ఈ గణంకాల లెక్కల్లోనే రాముడు ఈ భూమి  మీద జీవించి ఉన్నాడని వారు అంటున్నారు . వాల్మీకి రామాయణంలో  2 4 వేల శ్లోకాలను అక్షరం అక్షరం మధించి నిజాన్ని నిగ్గు తేల్చారు . ఖగోళ శాస్ర్త వేత్తల లెక్కల ప్రకారం రామాయణం 1 ౦ వేల సం || ల పూర్వం జరిగినవాస్తవం . ఇందుకు సంబందించిన ఆధారాలను కార్బన్ డేటింగ్ తో సహా శాస్ర్త వేత్తలు నిరూపిస్తున్నారు .
భారత దేశంలో రామాయణానికి సంబందించిన రుజువులన్ని దొరికాయి . ఉత్తర ప్రదేశ్ లోని పైజ బాద్ జిల్లాలోని అయోధ్య లో రాముడి జన్మ స్తలం మొట్టమొదట కనుగోన్నది విక్రమదిత్యడు .ఆయనే అయోధ్యలో గొప్ప ఆలయాన్ని నిర్మించాడు . రామాయణంలో పేర్కొన్న సరయు నది సాకేత పురి అన్ని ధృవీకరణ జరిగాయి .  అయోధ్య సరయు నది తీరంలోనే ఉంది . అటు లంకలో రావణుడి ఆన వాళ్ళు స్పష్టంగా లభించాయి . అన్నింటికీ మించి రాముడు లంకకు కట్టిన సేతువు ఇవాల్టికి ౩ ౦ కి. లో . మీ . మేర మనకు కనిపిస్తూనే ఉంది . ఇది పూర్తిగా మానవ నిర్మితామేనని నాసా కూడా స్పష్టం చేసింది 
వీటిని బేస్ చేసుకునే రామాయణ కాల నిర్ణయం పై పరిశోధన సాగింది . వాల్మికి రామాయణంలో రాముడు జన్మించిన సమయాన్ని ఆదికవి వర్ణించిన పద్యాలలో ఆయన జన్మ కాలాన్ని నిర్దారించారు  . సరోజ్ వాళ , డాక్టర్  పి.వి . వర్తక్ . డాక్టర్ సౌరభ్ పాత్ర . లాంటి ప్రముఖ హిస్తారియన్లు రాముడి పుట్టిన తేదిని నిర్దారించారు  . ఆస్ట్రో మాథ్స్ ప్రకారం రామాయణం 9 వేల ౩ వందల బి ,సి , సం || ల క్రితం జరిగింది . వాల్మికి రామాయణంలో ని బాల కాండ లోని 1 9 సర్గ లోని 8 ,9 , శ్లోకాలు రామ జననం గురించి వివరిస్తున్నాయి . ఉత్తరాయణం చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం . అ సమయంలో సూర్యుడు మేష రాశిలో 1 ౦ డిగ్రీల కోణంలో ఉన్నాడు , అంగారకుడు మకరంలో 2 8 డిగ్రి లలో ,గురువు కర్క్టక టక లో 5 డిగ్రీలలో , శుక్రుడు మీనా రాశిలో 27 డి|| , శని తుల రాశిలో 2 ౦ డిగ్రీల కోణంలో ఉన్నారు . మహా భారత యుద్ధం నాటి గ్రహ రాశుల ఉన్న పొజిషన్ బట్టి b,c ౩ వేల 1 వంద 2 లో జరిగినట్టు నిర్దరణ అయ్యింది . మొహంజదారో లో లభించిన రెడియోషన్ ఎపెక్ట్ కూడా దీని ఖచ్చితత్వాన్నే నిరూపిస్తున్నది . ఈ లెక్కలను ఆధారం చేసుకొని ప్లానిటరి పొజిషన్ ను ఆస్ట్రో శాస్త్ర వేత్తలు లెక్కిస్తూ వెళ్లారు . దీని ప్రకారం , సూర్యుడు , అంగారకుడు , గురువు , శుక్రుడు , శని రాహువు , బాల కాండలో పేర్కొన్న పొజిషన్ లో ఉన్నారు { to be kun ........}  

15, ఏప్రిల్ 2016, శుక్రవారం

దేవా రహస్యం ; శ్రీ రాముని జన్మ రహస్యం { 1 }

hm t.v  2014  ఏప్రిల్ 
వాస్తవంగా జరిగిందేనా లేక మిధ్య వాదామ . రాముడు నిజంగా ఈ భూమి మీద ఉంటె రావణ సంహారం చేసి ఉంటె ఆయనది చరిత్రే అయితే ఆయన ఎప్పుడు పుట్టాడు ? కాల  నిర్ణయం చేయడం సాధ్యమేనా .? శ్రీ రామ చంద్రుని  కాల కధ కధన రహస్యం ఏంటి ?


రామ రాజ్యం ఇవాళ ప్రపంచం అంత కోరుకునే ఆదర్శ వంతమైన పరి పాలన భారత దేశం మరే ఇతిహాసాలలో ఒకటిగా భావించే రామాయణంలో శ్రీరామ చంద్రుడు సాగించిన పరి పాలన ఇన్ని వేల సంవత్సరాల తరువాత కూడా ఈ దేశానికి మార్గ దర్శన మైంది . ఐతే రామాయణం ఇతిహాసమ ? లేక చరిత్ర ? శాస్ర్తియంగా లేని నిరూపణలు రామాయణాన్ని ఒక కధగా కొట్టి పారేస్తుంటే శాస్ర్తియతో సంబంధం లేని విశ్వసం రాముడి అస్తిత్వన్ని వాస్తవంగా గు ర్తిస్తోంది .ఇప్పుడు ఆస్ట్రో మ్యాటిక్ పరి శోధనలు సహేతుకంగా రుజువు చేస్తున్నాయి . మొన్న లంకలో రాముడి ఆనవాళ్ళు రామాయణాన్ని నిరూపించాయి . కిష్కింద సామ్రాజ్యం వానర రాజ్యానికి నిలువు దర్పంగా నిలిచింది . గోదావరి తన తీరాన రాముడి ఉనికిని చాటుతుంది . ఇప్పుడు ఖగోళ శాస్త్ర పరిశోధనలు మరింత రామాయణాన్ని చరిత్రగా ఖచ్చితంగా స్పష్టం చేస్తున్నాయి . రాముడు పుట్టాడు తేది తో సహా తేలి పోయింది . అనంత విశ్వంలో గ్రహాల కదలికలు మార్పులు రామాయణ కాలాన్ని నీరుపిస్తున్నాయి . బ్రిటిష్ వాళ్ళు మనకు చరిత్రే లేదన్నారు . కానీ ఔత్సాహిక పాశ్చాత్య చరిత్ర కారులు మన  హిస్టారియన్ల తో కలసి మన జాతి మూలల్లో అద్భుతాలు ఆవిష్కరిస్తున్న కొద్ది భారతీయుల చరిత్ర వందల వేలు లక్షల సంవత్సరాలుకు  పై బడి లోతుల్లోకి అంతు తెలియకుండా చొచ్చుక పోతున్నాయి . వాల్మీకి రచనలో కాల నిర్ణయం అంత ఖగోళ సంబంద ఉంది . రోదసిలో గ్రహాల ఆధారంగా రాముడు పుట్టింది ఖచ్చితంగా అని వీలు అవుతుంది దాని ఆధారంగా రాముడు పుట్టింది తేదీల వివరాలు తెలుసుకునేందుకు సాధ్యం అయింది . రాముడు కేవలం పౌరాణిక పాత్ర కాదు చరిత్ర . ఈ భూమిని పరి పాలించిన గొప్ప పాలకుడు ఆయన పుట్టింది నిజం . పెరిగింది నిజం . రావణ సంహారం చేసింది నిజం . రామాయణం పుక్కిటి పురాణం కాదు . రాముడు దేవుడా రామాయణం ఎప్పుడు జరిగింది ? ఇవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు . మన తరానికి అంతు పట్టని తెలియని ప్రశ్నలు . అసలు రామాయణమే లేదని ఇది కేవలం ఒక మిధ్య వాధమని కల్పిత కావ్యమని తప్ప చరిత్ర కాదని చెప్పేవాళ్ళు చాల మందే ఉంటారు ? కాని రామాయణ కాలం ఇప్పటికే విస్పస్టమైంది . టైం తో సహా తేలింది హిందూ కాల మాన ప్రకారం చతుర్యుగా విభజన మేరకు రామాయణం ఉనికి త్రేతా యుగంలో కనిపిస్తుంది . ఒక మహా యుగం అంటే కృత , త్రేతా , ద్వాపర , కలియుగాలన్నమాట . ఒక చతుర్యుగం మొత్తం 4౩ లక్షల 20 వేల సంవత్సరాలలో పూర్తీ అవుతుంది . { to be kun........... } 
నా అనుమతి లేనిదే ఈ పోస్ట్ ని ఎవరు కాఫీ & పేస్ట్ చేయరాదు 


                

11, ఏప్రిల్ 2016, సోమవారం

కోడి గుడ్డును ఎలా తయారు చేస్తరో తెలుసా ?


బాద౦ తింటే కంటి అద్దాలతో అవసరం లేదు

బాదo పప్పు ఆకారం చూస్తే అచ్చం కన్నులాగే ఉంటుంది . ప్రజల కంటి చూపు కోసం దేవుడు దీన్ని సృష్టించాడు . 
బాద౦ పప్పులు 2 ౦ ౦ , గ్రాములు , తీసుకొని రాత్రి వేడి నీటిలో నానా బెట్టాలి . తెల్లవారినే తరువాత పై తోలు తిసి నలగొట్టి చూర్ణం చేసుకొని ఎండబెట్టి పొడి చేసుకోవాలి . అదే విధంగా 
సోపు గింజలు 2౦౦ గ్రాములు తీసుకొని దోరగా వేయించి దంచి పొడి చేసుకొని దానికి కండ చెక్కర 2౦౦ గ్రాములు తీసుకొని ఈమూడింటిని కలుపుకొని ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి . 
పెద్దలకు రెండు స్పూన్ లు మోతాదుగా ఆవుపాలు వేడి చేసుకొని అందులో ఈ చూర్ణం కలుపుకొని సేవిస్తువుంటే నేత్ర దృష్టి పెరుగుతుంది . పిల్లలకయితే ఒక స్పూన్ చాలు .
 ఈ విధంగా ఒక సంవత్సరం వాడితే అద్దాలు వాడె అవసరం ఉండదు . అంతే గాక మెదడుకు జ్ఞాపక శక్తిని రెట్టింపు చేస్తుంది కృశించి పోయిన శరీర భాగాలను కూడా ఉత్తేజ భరితం చేస్తాయి . 


10, ఏప్రిల్ 2016, ఆదివారం

స్త్రీ ,పురుష శృంగారాన్ని శాసించే చంద్ర కళలు

శృంగార కలాధిపతి చంద్రుడు 
భూమిపై పుట్టిన ప్రతి జీవి ముఖ్యంగా మానవుల శృంగార జీవితం పై చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది . చంద్రునిలో పధహరు కళలు ఉన్నట్లుగానే స్త్రీ ,పురుషులలో కూడా పదహారు శృంగార కళ స్తానాలు ఉంటాయి . చంద్రుని కళల ప్రభావం ఆయా స్త్రీ ,పురుష జాతులను బట్టి ఆయా తిదులను బట్టి ఆయా దినాలలో ప్రేరెపింప బడుతుంటాయి . మానవులు ఎక్కడ నిద్రించిన చంద్ర కళల ప్రభావం నుండి తప్పించుకోలేరు . 

అందుకే మన ప్రాచినా సాహిత్యంలో స్త్రీ ,పురుషుల అనురాగ బందలను వివరించే సందర్బంలో ఎక్కువగా చంద్రును ప్రశంశ ఉంటుంది . కాబట్టి స్త్రీలు ,పురుష కళ స్తానాల గురించి , పురుషులు స్త్రీ కళ స్తానాల గురించి తెలుసుకొని వాటిని ఆచరణంలో పెట్టడడం ద్వారా అంతులేని ఆనందాన్ని పొందుతూ తమ దాంపత్య జీవితాన్ని సుఖమయం 
చేసుకోవచ్చు . 
కళా స్థానాలు అంటే ఏమిటి 
మనవ శరీరం ఒక మనోహరమైన వీణ లాంటిది .నైపుణ్యానమ్ గల విద్వా౦సుడు వీణను మీటినప్పుడు ఎన్నెన్నో స్వరాలూ పలికిన్చినట్లుగా శృంగార సరసులైన స్త్రీ ,పురుషులు మనవ శరీరంలో ఆయా ప్రదేశాలలో సున్నితముగా సుతరముగా తాకినపుడు ఆ శరీరము కూడా వీణ లాగే అంతులేని ఆనంద స్పందనలు  రగిలించి శృంగార రసాలను చిందింప చేస్తుంది . ఈ కళ స్థానాలు స్త్రీ పురుషులలో వేరు వేరు పక్షాలలో వేరు వేరు దిశలలో ప్రారంభమై చంద్ర కళల తో పాటే స్పందిస్తుoటయి. ఆ వివరాలు తెలుసుకుందాం . 


స్త్రీ ,పురుష షోడశ {16} కళ స్థానములు 
స్త్రీ ,పురుష శరీరాలలో ఎక్కడెక్కడ శృంగార కళ స్థానాలు ఉన్నాయో వాత్సయన  ముని వివరంగా తెలియజేసారు . 
{ 1} బొటన వేలు {2 } కాళీ మడిమ { ౩ } పిక్కలు  { 4 } తొడలు  { 5 } పిరుదులు  {6 } భగము / శిశ్నము {7 } నాభి  { 8 } భుజములు  {9 } చన్నులు {1 ౦ } చంకలు { 1 1 } చెవులు  { 1 2 } చెక్కిళ్ళు  { 1 ౩ } ముక్కు { 1 4 } గొంతు  [ 1 5 ] అధారములు  { 1 6 } తల  ఈ పదహారు స్థానాలను మన్మధ కళ స్తానములని పేర్కొంటూ ఈ స్థానములు స్త్రీ , పురుషులలో ఆయా తిదులను బట్టి ఎలా మారుతూ ఉంటాయో తెలియ చేసారు . 
స్త్రీ కళా స్థానములు - ఎడమనుండి కుడికి 

ప్రతి మాసంలో చంద్రుడు శుక్ల పక్షమిలో ఉన్నప్పుడు పాడ్యమి తిది నుండి స్త్రీ శరీరములో ఎడమ వైపు నుండి వరుసగా పైన  తెలిపిన అంగములలో ఒక్కొక్క అంగంలో శృంగార ప్రేరణ కలిగిస్తుంటాడు . అలాగే చంద్రుడు కృష్ణ పక్షమి లోకి రాగానే పదహారవ రోజునుండి కుడివైపు శరీర భాగములనుండి పై నుండి క్రిందకి వరుసగా ఆయా ప్రేరణలు కలుగుతు ఉంటాయి . ఆయా తిదులను బట్టి తన భార్య యొక్క మన్మధ కళ స్థానములను తెలుసుకొని భర్త ఆమెతో శృంగార ప్రయత్నం చేయాలి . ముందుగ ఆయా కళ స్థానాలలో ప్రేరణ కలిగిస్తూ వాంచలు తార స్థాయికి చేరిన తరువాత మైదునము ప్రారంబించి ఇరువురు సంపూర్ణ తృప్తి పొందాలని వాత్సాయన సూచించారు . 
పురుష కళ స్థానములు కుడి నుండి ఎడమకు 
చంద్రుడు కృష్ణ పక్షమిలో ఉన్నప్పుడు పాడ్యమి నుండి పురుషులలో కుడి వైపు వరుసగా పైన తెలిపిన ఆయ అంగములలో మన్మధ ప్రేరణ జరుగుతూ ఉంటుంది . అదే విధంగా చంద్రుడు శుక్ల పక్షమిలో ఉన్నప్పుడు పురుషులలో ఎడమ వైపున పై నుండి వరుసగా క్రిందకి ఆయా అవయములలో ప్రేరణలు కలుగుతు దిగుతూ ఉంటాయ్. ఈ మన్మధ కళలను గమనించి సక్రమంగా అవగాహనా చేసుకొని భార్య , తన భర్త యొక్క శరీరములో ఆయా ప్రదేశంలో ప్రేరణలు కలిగించి తన వంతు సహకరం అందిస్తూ తును తృప్తి పొంది తన భర్తను కూడా తృప్తి పొందేలా చేయాలనీ మహర్షుల ఆజ్ఞ . { వాత్సయన శాస్త్రం  నుండి } 


కంట్లో నీళ్ళు రాకుండా ఉల్లిపాయలను తరగడం ఎలా ?




8, ఏప్రిల్ 2016, శుక్రవారం

దీపరాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు

స్టీలు కుందుల్లోదీపారాధన చేయకూడదు . మట్టి లేదా ఇత్తడి ,వెండి కుందులు మాత్రమే వాడాలి . అగ్గి పుల్లతో దీపాన్ని వెలిగించ రాదు . అగరు బత్తితో వెలిగించాలి . దేవుని వద్ద ఒక వత్తితో దీపారాధన చేయరాదు . ఏక వత్తి శవం వద్ద మాత్రమే వెలిగిస్తారు . రెండు వత్తులు కలిపి ఒక వత్తి చేసి కుందిలో ఒకటి తూర్పు రెండవది ఉత్తరం ఉండాలి . కుంది అడుగున ఏదైనా చిన్న ప్లేటు పెట్టాలి . దీపారాదన కుందికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి . కుందిలను ఎప్పటికప్పుడే శుబ్రం చేయాలి . పాత వత్తులని వాడ కూడదు .విష్ణువుకు కుడి వైపున , శివునికి ఎడమ వైపున దీపం ఉండాలి . ఏ దేవత ,దేవి కైనా దీపం పక్కన మాత్రమే ఉండాలి .ఎదురు ఉండకూడదు .అలాగే చాల మంది కొబ్బరి కాయ కొట్టి వాటిని ఎదురు పెడతారు అలా పెట్ట కూడదు . వాటిని దేవుని వైపు ఉంచాలి . పోరా పాటున దీపం కొండ ఎక్కితే 1౦8 సార్లు ఓం నమ శివాయ అని దీపం వెలిగించాలి . ఈ రోజుల్లో వత్తులు అన్ని చేసినవి రెడి మెడ్  గా దొరుకుతున్నాయి . వీలైతే పగిడి పత్తి తో దీపారాధన చేస్తే మంచిది . కొబ్బరికాయ కొట్టిన తరువాత వాటికీ కొంత మంది కుంకుమతో మూడు బొట్లు పెడతారు అల పెట్ట కూడదు. కొబ్బరి కాయ కొట్టే ముందు దానికి ఉన్న పీచు అది మీ వైపుకు తిప్పుకొని కొట్టాలి . కాయను నీళ్ళతో  కడగా కూడదు . { ఈ పోస్ట్ ను ఎవరు కాఫీ చేయరాదు } 

6, ఏప్రిల్ 2016, బుధవారం

ప్రపంచంలో వింత చెట్టు ఆంద్ర ప్రదేశ్


ప్రభవ , విభవ అనే 60 స౦ || ఎలా ఉద్భవించాయి

నారాయణ నామ స్మరణ చేస్తూ నారదుడు ఒకసారి ద్వారకా నగరానికి వచ్చాడు . వచ్చిన మహర్షిని ఆహ్వానించి  సకల మర్యాదలు చేసి కుశల ప్రశ్నలు అడిగాడు శ్రీ క్రిష్ణ . నారదుడు స్వామి తమరు లీల మానుష విగ్రుహులు కదా మీ మాయ ప్రభావంతో ఎందరో మాయలో పడిపోయారు మీ మాయకు లోబడనివారు ఎవరు లేరు కదా అన్నాడు .శ్రీ కృష్ణుడు నారద ! మాయ బలీయమైన శక్తి . త్రి ముర్తులం మేమే ఆ మాయను జయించలేము .ఇక ఇతరుల విషయము చెప్పనేల ? అన్నాడు నారదుడు అందరి సంగతి ఏమోకాని స్వామి ! ఆ మాయ జితేన్ద్రియుడను , త్రి లోక సంచారిణి , పరమ బాగా వత్త్హోత్ముడను అయిన నన్ను మాత్రం ఎం చేయలేదు అన్నాడు ధీమాగా . శ్రీ కృష్ణుడు నవ్వి వురుకన్నాడు . అల కాసేపు బయట తిరుగుతూ మాట్లాడుకుందాం రా ! అన్నాడు సరే పదండి అంటూ నారదుడు అనుసరించాడు . అల వారిద్దరూ కాళీ నడకన ఎంత దూరం నడిచారో వారికే తెలియదు  . నారదుడు స్వామి నాకు దాహం వేస్తుంది కాళ్ళు లాగుతున్నాయి ఒక్క అడుగు కుడా వేయలేను అంటూ అక్కడే కుఉలబడి పోయాడు . శ్రీ క్రిష్ణ అదిగో నారద దగ్గరగా కొలను కనిపిస్తోంది అక్కడకు వెళ్లి నీరు తాగుదాం కొంచం ఓపిక తెచ్చుకో అంటూ చేయి అందించాడు . కొంత దూరం పోగానే కలువ పూలతో ఎగురుతున్న పక్షులతో కిల కిల రావాలతో అందమైన సరోవరం కనిపించింది . నారదుడికి ప్రాణం లేచి వచ్చింది ఆ కొలనులో దిగి కడుపు నిండా నీరు తాగి నారాయణ అంటూ నీటిలో మునిగాడు . పైకి లేవగానే అందమైన స్త్రీగా మరి పోయాడు శ్రీ క్రిష్ణ కనుమరుగై పోయాడు . అల ఆ సరోవర ప్రాంతంలో తిరుగుతున్న ఆమెకు ఒకనాడు అందమైన యువకుడైన యోగి ధ్యాన ముద్రలో ఉండి కనిపించడు . ఆయనకు పరి చర్యలు చేస్తూ వుంది పోయింది . యోగి ధ్యాన౦ నుండి లేవగానే కనుల ముందు యువతీ కనిపించటం ఆమె తనకు పరి చర్యలు చేయటం యోగికి సంతోషాన్ని కలిగించాయి .ఆ అందం తన ముందు ఉండడం యోగిని , అందగాడు , యువకుడైన , యోగి మన్మధ రూపం ఆమెనుఆకర్షించాయి . అల వారిద్దరూ వివాహ బంధంతో కలసి కాపురం చేస్తున్నారు . కొంత  కాలానికి ఆ యోగి వలన ఆమెకు 60 సంతానం కలిగారు . ఒకరోజున యోగి సమాధిలో ఉండగా పిల్లలంత చెట్ల కింద ఆడు కుంటున్నారు . ఆమె పిల్లలకు భర్తకు ఆహారంగా పళ్ళు ఏరుక వద్దామని గంపతో అడవికి వెళ్ళింది . గాప నిండా మామిడి పళ్ళు ను తేచ్చి భర్తుకు . బిడ్డలకు తల ఒకటి ఇచ్చింది . అది తినగానే అందరు గిల గిల తన్నుకొని ప్రాణాలు వదిలేశారు . క్షణాల్లో హటత్హుగా జరిగిన సంగటన చూచి దుక్కిస్తూ తను ఆ పండ్లనే తిని చని పోవాలని అనుకుంది . చెట్టు వద్దకు పోయి పైన పండు కనిపిస్తుంది కానీ చేతికి అందదు . ఎత్తుకోసం భర్త , పిల్లల శవాలను పేర్చి వాటి పైకి ఎక్కి పండు కోయాలని ప్రయత్నం చేస్తోంది . అంతలో ఒక వృద్ద బ్రాహ్మణుడు ఆ చెట్టు వద్దకు చేరి ఆ వింత దృశ్యం చూచాడు . అమ్మాయి ఎవరు నీవు ? ఇదేమిటి శవాలను గుత్తగా పేర్చి నువ్వు చేస్తున్న పని ఏమిటి వింతగా ఉంది > ఎవరు అసలు నువ్వు అన్నాడు . అందుకు ఆమె అయ్యా ఈ చని పోయిన మనిషి నా భర్త , పిల్లలు . జరిగిది అంత చెప్పి ఈ చెట్టు పల్ల కోసం అందకుంటే ఈ పని చేస్తున్నాను అంది .అందుకు బ్రాహ్మణుడు అమ్మ ! చని పోయిన వారికీ అంత్య క్రియలు చేయకుండా ఆహరం తినడం తప్పు కదా ? పైగా ఆత్మ హత్య మహా దోషం కదా ? ముందు వీరికి అంత్య క్రియలు చయాలి దిగి రా !నేను నీకు తోడుగా ఉంటాను ఆ తరువాత జరగా వలసినది ఆలోచిద్దం . ముందు స్నానం చేయాలి అ సరోవరం వద్దకు రా ! అటు ఆమెను ఆ కొలను వద్దకు తిసుక వచ్చి మూడు స్నానం చేయి . కొలనులో దిగి చేయి పైకి ఎత్తిపట్టి నీటిలో మునుగు అన్నాడు . అల బ్రాహ్మణుడు చెప్పినట్టుగానే చేయి పైకి ఎత్తి కొలనులో మునిగి పైకి లేవగానే ఆ స్త్రీ ఎప్పటిల నారదుడిగా మారిపోయాడు . ఆ బ్రాహ్మణుడు శ్రీ కృష్ణుడు గా మరి పోయాడు . స్వామి ఇదంతా నీ మాయో గద! నేను నీ మాయకు లోబడి పోయి స్త్రీ గా అయ్యాను .పిల్లలను కన్నాను ' అన్నాడు తలవంచి సిగ్గుతో చేతి గాజులు చూచుకుంటూ. కృష్ణుడు నారద మాయకు అందరం లో బడక తప్పదు ఎవరు తప్పించుకోలేరు . మరల నీటిలో మునుగు అన్నాడు . కృష్ణుని మాటలతో మరోసారి నీటిలో మునిగి లేచాడు . చేతి గాజులు పోయాయి . స్వామి స్త్రీగా ఉన్నప్పుడు నన్ను పెండ్లాడిన ఆయన ఎవరు ? ఆ బిడ్డలు ఎవరు ? అన్నాడు . శ్రీ క్రిష్ణ నారద ఆయన కల పురుషుడు , ఆ బిడ్డలు ప్రబావ వాది సంవత్సరాలు . కల పురుషునికి నకిలీ స్త్రీకి పుట్టిన బిడ్డలే ప్రబావ విబవ అనే పేర్లతో సంవత్సరాలుగా పిలువా బడుతు ఉంటారు అన్నాడు .కృష్ణను కీర్తిస్తూ హరి నామ స్మరణతో గగన మార్గాన వెళ్లి పోయాడు నారదుడు . అల లోకంలో కాలము - స౦  || రాలు మిగిలి పోయాయి { శుభం } { నా అనుమతి లేనిదే ఎవరు ఈ పోస్ట్ ను కాఫీ చేయరాదు }

5, ఏప్రిల్ 2016, మంగళవారం

ఆడపిల్ల లేదా మగపిల్లవాడు పుట్టాలంటే ?

సంతానాన్ని తమ ఛాయిస్ ప్రకారం పొందేదుకు ప్రపంచ వ్యాప్తంగా రక  రకాల పద్దతులు అమల్లో ఉన్నాయి . ఆయుర్వేద గ్రందాల్లో పుంసవన విధీ పేరుతో కొన్ని పక్రియలను సంహితకారులు వివరించారు . బహిష్టి అయిన మొదటి మూడు రోజులు వదలివేసి ౪, ౬, ౮, ౧౦, ౧౨, ౧౪ " సరి " రోజుల్లో భార్య భర్తలు కలిస్తే మగపిల్లవాడు . ౫ , ౭ , ౯, ౧౧ , ౧౩  ఇలా " బేసి " రోజుల్లో కలిస్తే ఆడపిల్ల కలుగుతుంది . అలాగే గర్బ దానం తరువాత పుష్యమి నక్షత్రం రోజున  భర్త , భార్య  ముక్కు రంద్రల్లో లేత మర్రి ఊడలతో చేసిన క్షీర కల్పాన్ని కుడి ముక్కులో వేస్తె మగ పిల్లవాడు  , ఎడం ముక్కులో వేస్తె ఆడపిల్ల పుడతారని సంహితకరులు సూచించారు . { ఆధారం  డా || చిరుమామిళ్ళ మురళి మనోహర్ . ఎం.డి  ఆయుర్వేద } 
Add caption